రైతు ఆత్మహత్యలపై తప్పుుడు ప్రచారం..: ఎమ్మెల్సీ పల్లా

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు.

70 లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు.దేశంలోనే ఎక్కువ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

రైతు పండించిన పంటలకు మద్ధతు ధర ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.రైతులకు వ్యతిరేకంగా కేంద్రం రైతు చట్టాలు తెచ్చిందని, రైతులకు పీఎం కిసాన్ ఇవ్వకపోగా రైతుల నుంచే కేంద్రం డబ్బు వసూలు చేస్తోందని ఆరోపించారు.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు