దర్శకుడితో దాన్ని గెలకొద్దన్న చిరు!

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

రామ్‌ చరణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ మరియు ఎన్వీ ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగు నేటి విటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని దర్శకుడు సురేందర్‌ రెడ్డి మొదట భావించాడు.కాని తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా సురేందర్‌ రెడ్డిని పిలిపించి ఒరిజినల్‌ ‘తని ఒరువన్‌’ సినిమా ఎలా ఉందో తెలుగులో కూడా అచ్చు అలాగే దించేయాల్సిందిగా చెప్పాడట.

తెలుగు నేటివిటీ కోసం అంటూ స్క్రిప్ట్‌ను, కథను గెలకొద్దు అంటూ చిరు దర్శకుడు సురేందర్‌ రెడ్డికి గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది.చిరంజీవి మాటతో తమిళంలో ఎలా ఉందో అచ్చు అలాగే దించేయాలని, తన సొంత తెలివి తేటలు ఉపయోగించకుండా, తన క్రియేటివిటీని పక్కకు పెట్టి దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు.

చిన్న సీన్‌లో కూడా మార్పు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా దించేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు.అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత అల్లు అరవింద్‌ సిద్దం అయ్యాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు తమిళ నిన్నటి తరం స్టార్‌ హీరో అరవింద్‌ స్వామి ఇటీవలే ఒప్పుకున్నాడు.త్వరలోనే హీరోయిన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

శరవేగంగా, తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు సురేందర్‌ రెడ్డి భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు