రుతుస్రావం సమయంలో ఆలయానికి ఎందుకు వెళ్ళకూడదో తెలుసా..

ప్రస్తుత సమాజం అంటే ఏ నియమాలు, కట్టుబాట్లు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జీవిస్తున్నారు.

కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నియమాలు లేకుండా మనిషి సమాజంలో జీవించలేకపోయేవాడు.

స్థిరమైన సమాజానికి కొన్ని నియమాలు కచ్చితంగా అవసరమవుతాయి.ఎలాంటి నియమల విషయానికి వస్తే రుతుస్రావం కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది.

స్త్రీలలో రుతుక్రమం అనేది సహజమైన ప్రక్రియ పురాతన కాలం నుంచి ఈ రుతుస్రావం గురించి చాలా నమ్మకాలు ఆచారాలు ఉన్నాయని చాలామందికి తెలుసు.భారతదేశ ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా బహిష్టు పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సమయంలో కూడా చాలా చోట్ల పీరియడ్స్ వచ్చిన స్త్రీని అపవిత్రంగా చూస్తూనే ఉంటారు.ఆలయం పూజలు, నదిలో స్నానం చేయడం రసస్వాల అయిన స్త్రీలు గుడికి దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు.

Advertisement

పూజ ఎందుకు చేయకూడదు అనే శాస్త్రీయ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రుతుక్రమం సమయంలో ఆలయాలకు, ప్రార్ధన స్థలాలకు వెళ్లడాన్ని హిందూ ధర్మం నిషేధించింది.ఇది పరమ సత్యం అని దాదాపు చాలామందికి తెలుసు.వంట గదిలోకి వెళ్లకూడదని, నదిలో స్నానం చేయకూడదని కూడా చెబుతూ ఉంటారు.

దీనికి మతపరమైన కారణాలు ఏవైనా దీనికి శాస్త్రీయ కారణం హార్మోన్ల మార్పులే, రుతుక్రమం సమయంలో మహిళలల శరీరంలో చాలా హార్మోన్లు మారుతూ ఉంటాయి.దీని వలన ఆమెకు చిరాకు కోపం వస్తూ ఉంటుంది.

ఆమె మనసు ప్రతికూలతతో నిండిపోయి ఉంటుంది.నదిలో స్నానం చేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఈ నిబంధనను పెట్టారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
శరీ‌రంలో మెగ్నీషియం లోపిస్తే డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే.. జాగ్ర‌త్త‌!

ఆలయం అనేది సానుకూలతతో ఉన్న ప్రదేశం కాబట్టి ఆలయానికి వెళ్ళేటప్పుడు మనసు ప్రశాంతతతో నిండి ఉండాలి.కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు చిరాకుగా అనిపిస్తే ప్రశాంతంగా అస్సలు ఉండదు.ఇదే కాకుండా పూర్వకాలంలో ఏదైనా దేవుడిని పూజించేటప్పుడు కీర్తన ముఖ్య మంత్రం పఠించకుండా పూజ పూర్తయ్యేది కాదు.

Advertisement

మంత్రాన్ని శ్రద్ధగా పట్టించాలి.ఉచ్చరణలో తప్పులు చేయకూడదు.

కానీ రుతుక్రమం సమయంలో ఒక మహిళ నొప్పి ఆలసటతో ఉంటుంది.ఈ సమయంలో ఎక్కువ సేపు ఒకే చోటు చోటా కూర్చొని మంత్రం జపించడం అస్సలు వీలుకాదు.

అందుకే స్త్రీలను పూజలు చేయడం నిషేధించారు.