మహిళలకు నెలసరిలో తలస్నానం, గుడికి వెళ్లడం నిషేధం.. ఎందుకో తెలుసా..?

నెలసరి( Periods ) అనగానే చాలా మంది ఆడవాళ్లు ఎంతగానో భయాందోళనకు గురవుతారు.

ఇక కొందరికి పీరియడ్స్ అన్నవి సులువుగా ఉంటే, మరికొందరికి ఏమో పీరియడ్స్ చాలా ఇబ్బందిగా,బాధాకరంగా ఉంటాయి.అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు నడుము నొప్పి, పొత్తికడుపులో నొప్పి, తీవ్రంగా రక్తస్రావం, నీరసం, కళ్ళు తిరగడం, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.కానీ ఒక్కొక్కరికి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి.

ఆ సమయంలో బయటకు వెళ్లాలంటే నిజంగానే ఎంతో కష్టం గా అనిపిస్తుంది.పీరియడ్స్ అన్నవి అందరికీ ఒకేలా ఉండవు.

ఒక్కో శరీరతత్వం బట్టి పీరియడ్స్ ఒక్కో రకంగా ఉంటాయి.అయితే ఇవి ప్రస్తుత సమాజంలో మూఢాచారంగా, అపవిత్రంగా తయారయ్యాయి.

పూర్వం పెద్దలు చెప్పిన కారణాలు వేరు కానీ ఇప్పుడు పాటిస్తున్న కారణాలు, జీవనం వేరు.అందులోనూ కొందరి ఇళ్లలో ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చిన వాళ్ళు అవి ముట్టుకోకూడదు, ఇవి చేయకూడదు, పిల్లల్ని ఎత్తుకో కూడదు ఇలా ఎన్నో రకాల మూఢనమ్మకాలు ( Superstitions ) చెబుతూ ఉంటారు.వీటితో ఆ మహిళలతో( Women ) పాటు ఇంట్లోనీ వారు కూడా రోజులు చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ముఖ్యంగా గ్రామాలలో మాత్రం ఇప్పటికి కూడా ఈ మూఢనమ్మకాలను అలానే పాటిస్తూ ఉన్నారు.అయితే మహిళల పీరియడ్స్ వెనుక పెద్దలు చెప్పిన మూఢనమ్మకాల వెనుక కొన్ని సైంటిఫిక్ రీసన్స్( Scientific Reasons ) కూడా ఉన్నాయి.

వాటిని గ్రహిస్తే మహిళలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని ఉండదు.మహిళలకు నెలసరి సమయంలో ఎండోమెట్రియం అన్న పొర మందంగా పెరుగుతుంది.అలాగే ఫలదీకరణ చెందదు.

అది అండంతో పాటు రక్తస్రావం ద్వారా శరీరం నుండి బయటికి పోవాలి.

లేదంటే పది రకాల సంతాన సాఫల్య సమస్యలు( Fertility Problems ) ఎదురవుతాయి.అలాగే మహిళలు పీరియడ్స్ ఉన్న వెంటనే నీళ్లు పోసుకుంటే శరీరంలో రక్తస్రావం ఆగిపోతుంది.అందుకే పీరియడ్స్ సమయంలో మూడు రోజుల వరకు స్నానం( Bathing ) చేయకుండా ఉండడమే మంచిది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024

అలాగే మహిళలు గుడికి ఎందుకు నిషేధమని అన్నారంటే పూర్వం దేవాలయాల్లో ఊరి చివరన ఉండేవి.అక్కడికి వెళ్లాలంటే ఎంతో దూరం నడవాలి.ఇలా నడవడం వలన మహిళలకు అధిక రక్తస్రావం అవుతుంది.

కాబట్టి వెళ్లకూడదని అప్పట్లో చెప్పేవారు.ఇక గుడికి ( Temple ) వెళ్లే క్రమంలో క్రూరం మృగాలు రక్తం వాసన పసిగట్టి దాడి చేసి ప్రమాదం కూడా ఉందని దేవదర్శనాన్ని అప్పట్లో నిషేధించారు.

తాజా వార్తలు