అయ్యప్ప కి కన్నె స్వాములు అంటే ఇష్టం ఎందుకో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు.

అయ్యప్ప పేరు అయ్యా అంటే విష్ణువు మరియు అప్ప అంటే శివుడు అని అర్థం వస్తుంది.

విష్ణు అవతారం, మోహిని మరియు శివుడి కలయిక వలన అయ్యప్ప జన్మించాడు.కాబట్టి స్వామికి అయ్యప్ప అని పేరు వచ్చింది.

ఇంకా ఈయనను హరిహర సుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు.అయితే అయ్యప్ప స్వామి మాల ధారణ వేసుకున్న వారిలో కన్నె స్వాములను ఎక్కువగా ఆరాధిస్తుంటారు.

అయితే అయ్యప్పకు కన్నే స్వాములు అంటేనే ఎందుకంత ఇష్టం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిసారిగా అయ్యప్ప మాల ధారణ వేసుకున్న భక్తులను కన్నె స్వాములుగా పిలుస్తూ ఉంటారు.

Advertisement

అయితే అయ్యప్ప స్వామికి కన్నె స్వాములు అంటే ఇష్టం ఉండడానికి ఒక కథ ఉంది.ఈ పురాణాలలోకెళ్తే దత్తత్రియుడి భార్య లీలావతి ఒక శాపంతో మహిషాసురుని సోదరి మహిషాసుర జన్మించింది.

అయితే ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో తన అన్నను చంపినందుకుగాను దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని శక్తులను పొంది ఆ తర్వాత ప్రజలను హింసించ సాగింది.

దీనివల్ల దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు అయ్యప్పగా జన్మించి దత్తత్రియుడు అయ్యప్పగా జన్మించి మహిషసురుని సంహరిస్తాడు.దీనివల్ల ఆమెకు శాప విమోచనం లభిస్తుంది.దీనివల్ల ఆమె అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది.

ఇక ఆమె కోరికను అయ్యప్ప స్వామి తిరస్కరిస్తాడు.అంతేకాకుండా ఆమె పట్టు విడవకపోవడంతో తన మాల వేసుకుని 40 రోజులు దీక్ష చేసిన కన్నే స్వామి తన దర్శనానికి రానప్పుడు తనని పెళ్లి చేసుకుంటారని మాట ఇస్తాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక వారి రాకకు గుర్తుగా శరణ్ గుత్తిలో బాణాలనుకొచ్చుతారు.

Advertisement

అక్కడ ఎప్పుడైతే ఒక భాగం కూడా కనిపించదో అప్పుడు పెళ్ళాడుతానని చెబుతాడు.అంతేకాకుండా శబరి కొండల్లో నీవు పురోత్తమా గా పూజలు అందుకుంటావని తెలిపారు.అయితే దీనికి గల అర్థం కన్నే స్వాముల రాక ఎప్పటికీ ఆగదని ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి అవతారం.

దీనిలో భాగంగానే శబరిమలకు వచ్చిన కన్నే స్వాములు ఎరిమెల్లి నుంచి తీసుకొచ్చిన బానులను శరం గుత్తిలో ఉంచుతారు.ఈ కారణం చేతనే ఎక్కడికి వెళ్లినా అయ్యప్ప భక్తులలో కన్నే స్వాములకు అంత ప్రాధాన్యత ఉంటుంది.

తాజా వార్తలు