శరీరం, మనస్సు, ఆత్మల కలయికనే మానవత్వం.వేదాంత పరి భాషలో చేయుట, తలచుట, ఉండుట అంటారు.
సేవ చేసేది దేహం, తలంచేది మనస్సు, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ.శరీరం నిరంతరం కర్మలను ఆచరిస్తూ.
నిశ్వాసలు శరీరం ప్రధాన కర్మలు.కర్మలను ఆధారం చేసుకునేది దేహం.మనం ఎంత మంచిగా ప్రవర్తించినా మనకు తెలియకుండానే ఐదు దోషాలు కలుగుతాయి.1.దైవయజ్ఞం 2.పితృయజ్ఞం 3.వేదపఠనము (స్వాధ్యాయము) 4.భూతయజ్ఞం 5.అతిథి యజ్ఞం.
అయితే దైవ యజ్ఞం అనగా భగవత్ చింతన, ప్రార్ధన, పూజ, శ్రవణం, కీర్తనం మొదలగునవి.రెండోది పితృ యజ్ఞం.అనగా దేహమునిచ్చి పెంచిన తల్లి దండ్రులను, వారు జీవించి ఉన్నంత వరకు, వారికి ఏ బాధ రానీయకుండా సేవలు చేయుట, మరణించిన తర్వాత పితృ దేవతా కార్యాలు నిర్వహించడం.మూడోది వేద పఠనము.
.అనగా వేదాల్లో గల మంత్రాలలో ముఖ్యమైనది గాయత్రీ మహా మంత్రము మరియు మహా మృత్యుంజయ మంత్ర జపము లేక పురుష సూక్తము, సద్గంధ పఠనం.నాలుగోది భూత యజ్ఞం.
అనగా కాకులకు, పిచ్చుకలకు, ఆవులకు, కుక్కలకు నీవు తినే ముందు ఆహారము పెట్టడం.ఐదోది అతిథి యజ్ఞం అనగా ఇంటికి వచ్చిన బంధు మిత్రులకు, భిక్షకులకు అన్నం పెట్టడం.
మంత్రోప దేశమునకు శుభమైన తిధులు.పూర్ణిమ, పంచమి, విదియ, సప్తమి,శు.
త్రయోదశి, శు.దశమి కృష్ణపక్షములో కంటే శుక్లపక్షము మంచిది.షష్ఠి మరియు గ్రహణ సమయములందు మంత్రోపదేశమునకు అసలు మంచిది కాదు.
గ్రహణ సమయములలో మంత్రదీక్ష తీసుకుంటే 7 జన్మలు దరిద్రమును అనుభవించుదురు.మంత్రోప దేశమునకు శుభరాశులు.
మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, కుంభం.మంత్రోపదేశమునకు శుభసమయములు.
ప్రాతః సమయము, ఉదయ సంధ్యా సమయము, మిట్ట మధ్యాహ్న సమయము వరుసగా శుభప్రదములు.మంత్రోప దేశమునకు అర్ధ రాత్రి, అధిక మాసాలు మంచిది కాదు.
సాయం సంధ్య మధ్య ఫలితము.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy