భారతదేశంలో ఎంత మందికి ఈ సౌక‌ర్యాలు ఉన్నాయో తెలుసా?

భార‌త‌దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మ‌రింత‌గా మెరుగుపడుతున్నాయి.పిక్సెల్స్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2019-21)లో భారతదేశానికి సంబంధించి అందించిన నివేదిక ప్రకారం దేశంలోని 7.

5 శాతం కుటుంబాలకు కారు ఉంది.ఇందులో అగ్రస్థానంలో గోవా ఉంది.భారతదేశంలో 49.7 శాతం కుటుంబాలకు బైక్‌ ఉంది.2018లో ఈ శాతం 37.7 గా ఉంది.బైక్ కలిగి ఉన్న కుటుంబాల‌లో పంజాబ్ ముందంజలో ఉండగా, రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది.ఇక్కడ 66.4 శాతం మంది ప్రజలు బైక్ కలిగి ఉన్నారు.ఉత్తరప్రదేశ్‌లో 51.1 శాతం, మధ్యప్రదేశ్‌లో 51.5 శాతం, మహారాష్ట్రలో 53.9 శాతం, ఉత్తరాఖండ్‌లో 46.1 శాతం, గుజరాత్‌లో 61.1 శాతం మంది బైక్‌ల‌ను కలిగి ఉన్నారు.అదే సమయంలో సైకిళ్ల సంఖ్య బైక్‌ల కంటే కొంచెం తక్కువగా ఉంది.దేశంలోని 50.4 శాతం కుటుంబాలకు సైకిల్ ఉంది.విశేషమేమిటంటే గత కొన్నేళ్లుగా ఈ శాతం తగ్గగా.

కార్లు, బైకుల శాతం పెరిగింది.రాష్ట్రాలను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో 75.6 శాతం, బెంగాల్‌లో 78 శాతం, ఒడిశాలో 72.5 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 70 శాతం, పంజాబ్‌లో 67 శాతం మంది బైక్‌లు కలిగి ఉన్నారు.దేశంలో 24 శాతం మందికి ఏసీ లేదా కూలర్ ఉంది.ఇందులో పట్టణ భారతదేశంలో 39.5 శాతం, గ్రామీణ భారతదేశంలో 15.8 శాతం మంది ఏసీ లేదా కూలర్‌లను కలిగి ఉన్నారు.ఇందులో చండీగఢ్ అగ్రస్థానంలో ఉంది.ఇక్కడ 77.9 శాతం ఇళ్లలో ఏసీ ఉంది.దీని తర్వాత ఢిల్లీలో 74.3, పంజాబ్‌లో 70.2, హర్యానాలో 61.8, రాజస్థాన్‌లో 53.6 శాతం మంది తమ ఇంట్లో ఏసీ లేదా కూలర్‌ను కలిగి ఉన్నారు.దేశంలో 93 శాతం మందికి మొబైల్ ఫోన్లు, 88 శాతం మందికి ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, 68 శాతం మందికి టెలివిజన్, 50 శాతం మందికి మోటార్ సైకిళ్లు, 49 శాతం మందికి ఇంటర్నెట్, 18 శాతం మందికి వాషింగ్ మెషీన్లు ఉన్నాయి.

ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!
Advertisement

తాజా వార్తలు