మాట్లాడుకుందామని పిలిచి దాడులు చేస్తారా..?: అచ్చెన్న

వైసీపీ కాలకేయులను దళితులపైకి వదిలారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.కాలకేయుల సంఘం అధ్యక్షుడిలా వైసీపీ నేత హరికృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మాట్లాడుకుందామని పిలిచి కంతేరు దళితులపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు.దళితులపై దాడి జరిగి 24 గంటలు గడిచినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement