ఇంద్రకీలాద్రి పై ఘనంగా ప్రారంభమైన భవాని దీక్షల విరమణలు...

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై ఘనంగా ప్రారంభమైన భవాని దీక్షల విరమణలు. హోమగుండాలకు ఆజ్యం సమర్పించిన వేదపండితులు, ఈఓ భ్రమరాంభ, ఆలయ అర్చకులు, స్ధానాచార్యులు.

అగ్ని ప్రతిష్ఠాపన చేసి 3 హోమగుండాలను వెలిగించి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం.ఇవాళ నుంచీ ఐదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు.

దాదాపు ఐదు రోజుల పాటు జరగనున్న దీక్షా విరమణలు.భవాని దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు.

కరోనా తరువాత జరుగుతున్న దీక్షలు కావడంతో 7లక్షల పైగా అమ్మవారి దర్శనార్ధం భవానీలు రావొచ్చని అంచనా.ఉదయం 6.30 నిమిషాలకు దీక్షల విరమణలు ప్రారంభం.

Advertisement

3 అగ్ని హోమగుండాలను వెలగించి దీక్షలను ప్రారంభించనున్న ఈవో బ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు. భవానిల కోసం తాత్కాలిక షెడ్లు, కేస ఖండన శాలలు ఎర్పాటు.వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు.

ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణకు అనుమతి.దీక్షా విరమణలకు వచ్చే భవానీలకు పటిష్ట ఏర్పాట్లు.10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు.20లక్షల లడ్డూలు సిద్దం చేసిన దుర్గగుడి అధికారులు. సీతమ్మ పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ జల్లు స్నానాలు ఎర్పాటు.

Advertisement

తాజా వార్తలు