కేసీఆర్ రాష్ట్రములో గుట్కా లేదు మట్కా లేదు గుడుంబా లేదు, పేకాట లేదు అని ఎన్నోసార్లు చెప్పాడు.2017 నుండి విచారణ అధికారులను నేను అప్రమత్తం చేస్తూనే ఉన్నా.
డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో విజ్రంబిస్తుంది.
డ్రగ్స్ గురించి మేము మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికారు.సింగరేణి కాలనీ లో జరిగిన బాలిక అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా ??దూల్పేట్ గుడుంబా స్థావరల పై దాడులు చేసారు కానీ వారికీ ప్రత్యామ్నాయం కల్పించలేదు.అందుకే వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారు.
స్కూల్స్ నుండి కాలేజెస్ వరకు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి.జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్స్ ఉండే, ఇయ్యాల 90 పబ్స్ ఉన్నాయి.బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో నైట్ బయటికి వెళ్ళాలి అంటే నా లాంటి వాడికి కూడా భయం అవుతుంది.2017 విచారణ ఏం అయింది.ఎందుకు అటక ఎక్కింది.
ఆకున్ సభర్వాల్ ను అర్థాన్తరంగా బదిలీ ఎందుకు చేసారు.అప్పుడు 12 ఏఫైఆర్ లు చేసారు.
ఏం అయింది.దింట్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది.
అన్నీ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా అయినా కూడా ముందుకు రాలేదు.హై కోర్ట్ కు కూడా వెళ్లిన.
తెలంగాణ యువతను, ప్రజలను డ్రగ్స్ నుండి కాపాడుకోవాలి.నైజిరియా నుండి వచ్చిన వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు.
ఈడీ వాళ్ళు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం మా విచారణను వ్యతిరేకిస్తుంది అని చెప్తున్నారు.
స్పష్టంగా ఈడీ చెప్పింది, ప్రభుత్వం సహకరించట్లేదని.ఎక్సయజ్ శాఖ దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి కానీ ఈడీ వాళ్లకు ఇవ్వట్లేదు.
సరఫరా చేసే వాళ్ళు, వాడిన వాళ్ళు, అమ్మే వాళ్ళు మూడు రకాల నేరస్థులు ఉన్నారు.డ్రగ్స్ కేసుల్లో.
ఇతర దేశాల నుండి సప్లయ్ చేస్తున్నారు.గుజరాత్, ముంబై పోర్టులలో 100 క్వింటాల్ డ్రగ్స్ పట్టుబడ్డాయి.
వ్యవస్థికృత నేరానికి పాల్పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వంతంత్రంగా విచారణ చేయాలనీ కోరుతున్నాను.
మీరు సేకరించిన అన్నీ ఆధారాలు, సాక్ష్యలు, వెంటనే ఈడీ కి ఇవ్వండి.కోర్ట్ ఆదేశాలు పాటించండి.
ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంకు ఏ అభ్యన్తరం అని అడుగుతున్నారు.డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా అన్నారు.
కానీ ఏం జరగలేదు మాటలే మారినాయి.దొరగారు లేచినపుడే ఊరు తెల్లారినట్లు ఉంది కేసీఆర్ కథ.సగం హైదరాబాద్ మత్తులో ఊగుతుంది.1000 మందితో ఒక విభాగం ఏర్పాటు చేశామని చెప్తున్నారు మరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ కి ఎందుకు సహకరించట్లేదు.కేటీఆర్ కు వైట్ చాలాంజ్ విసిరాము.
వైట్ చాలాంజ్ అంటే డ్రగ్స్ తీసుకోలేదని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం.విశ్వేశ్వర్ రెడ్డి కి, కేటీఆర్ కు సవాలు విసిరాను.
వెంటనే కేటీఆర్ కోర్ట్ వెళ్లి స్టే తెచ్చుకున్నాడు.అందుకే నేనేమి మాట్లాడాను.
మీరు సేకరించిన డేటా, ఆధారాలు, ఈడీ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.మీ భయానికి గల కారణాలు ఏంటి, మీరు ఎవరిని కాపాడాలని చూస్తున్నారు.2017 కు సంబందించిన దాని పై కూడా కేసు వేసా.టోనీకి సంబందించిన డిజిటల్ డేటా ఇవ్వాలని కోరుతున్నాను.
ప్రభుత్వం ఈడీకి తక్షణమే సహకరించాలి.పంజాబ్ లో డ్రగ్స్ వాడి యువత నాశనం అయింది.
తెలంగాణ మరో పంజాబ్ కానివ్వను.డ్రగ్స్ వాడే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చర్యలు తీసుకోండి.
సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.డ్రగ్స్ వాడకుండా చూడండి.
మీ ఇండస్ట్రీ లో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ కి బ్యాడ్ నేమ్ వస్తుంది.ఇండస్ట్రీ ని డ్రగ్స్ నుండి కాపాడండి.12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది.రాసి పెట్టుకోండి.
అధికారం లోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తా.చార్మినార్ దగ్గర గుడ్డలు ఉడదీసి కొడుతాం.2023 మర్చి లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.డ్రగ్స్ వాడే వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఏ బొక్కలో దాక్కున్న గుంజుకు వస్తాం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy