ఖమ్మంలో నిరుద్యోగ బహిరంగ సభపై కాంగ్రెస్ నేతల చర్చ

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి నివాసంలో నేతల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్లు షబ్బీర్ అలీ, బలరాం నాయక్ వంటి నాయకులు హాజరు అయ్యారు.

ఖమ్మంలో ఈనెల 24న నిర్వహించనున్న నిరుద్యోగ బహిరంగ సభపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.అయితే ఇప్పటికే నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే 1న రంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ నిరసన దీక్షలను నిర్వహించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు