రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

ఢిల్లీలో రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.

ఈ మేరకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే వామపక్షాలకు కాంగ్రెస్ నాలుగు సీట్లను కేటాయించింది.ఈ క్రమంలోనే రేపు మిగతా 60 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనుందని తెలుస్తోంది.

అయితే కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిందని సమాచారం.ఇందులో భాగంగా ఎల్బీనగర్, సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నర్సాపూర్, అంబర్ పేట స్థానాలకు ఇద్దరు చొప్పున పోటీ చేసేందుకు సిద్దంగా ఉండగా వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా తొలి విడతలో భాగంగా 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!

తాజా వార్తలు