అనంతపురంలో కుప్పకూలిన పెన్నానది వంతెన

అనంతపురం జిల్లాలో పెన్నా నది వంతెన కుప్పకూలింది.నదికి వరద ఉధృతి అధికంగా ఉండటంతో బ్రిడ్జి కూలినట్లు తెలుస్తోంది.

ఎగువన పేరూర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో పెన్నా నది ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.అయితే వరద ఉధృతి కారణంగా గతంలో సగం బ్రిడ్జి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

తాజాగా మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది.దీంతో కంబదూరు మండలం నూతిమడుగు వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement