నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న సీఎం వైయస్‌.జగన్‌..

తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్‌ నేతన్ననేస్తం( YSR Nethanna Nestham ) పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం.

ఉదయం సీఎం వైయస్‌.

జగన్‌( CM YS jagan ) తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరి చేరుకుంటారు.అనంతరం విశ్వోదయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం వైఎస్సార్‌ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేస్తారు.ఆ తర్వాత వెంకటగిరి త్రిభువన్‌ సెంటర్‌లో మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధనరెడ్డి( Janardhana Reddy ) విగ్రహాన్ని సీఎం శ్రీ వైయస్‌.

జగన్‌ ఆవిష్కరిస్తారు.కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్5, శనివారం 2024

తాజా వార్తలు