శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అమరావతి:తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం.

మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించిన వేదపండితులు.ముఖ్యమంత్రితో పాటు శాంతి యజ్ఞంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ.

శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement