సీఎం జగన్ బీసీల ద్రోహి..: చంద్రబాబు వ్యాఖ్యలు

బీసీల కోసం పని చేసే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనేనని చెప్పారు.

బీసీలకు టీడీపీ రిజర్వేషన్లు పెంచితే వైసీపీ తగ్గించిందని విమర్శించారు.వెనుకబడిన వర్గాలను నాయకులుగా చేసిన పార్టీ తమదన్నారు.

బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న పార్టీ వైసీపీ అని ఆరోపించారు.బీసీల ద్రోహి సీఎం జగన్ అని తెలిపారు.

వృత్తులను ఎగతాళి చేసేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వెల్లడించారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet

తాజా వార్తలు