Chiranjeevi Walter Veeraiah : విదేశాలకు పయనమైన మెగాస్టార్.. కారణం ఇదేనా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి విజయం కావడంతో మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా నుంచి బాస్ సాంగ్ విడుదల చేయగా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ఓ షెడ్యూల్ చిత్రీకరణ నిమిత్తం విదేశాలకు వెళుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ తో పాటు ఎన్టీఆర్ చిత్ర బృందం ఫ్రాన్స్ కి వెళ్ళబోతున్నట్టు సమాచారం.డిసెంబర్ మొదటి వారంలో కల్లా ఈ సినిమా షూటింగు మొత్తం పూర్తి చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.

Advertisement

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ నటించిన విషయం మనకు తెలిసిందే.తాజాగా రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలోనే ఫ్రాన్స్ వెళ్లి అక్కడ చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే సంక్రాంతి కానుకగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి పోటీకి దిగబోతున్నాయి.దీంతో ఈ రెండు సినిమాలపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు