మంచిర్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం

మంచిర్యాల జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.కాసిపేట మండలం పెద్ద ధర్మారం శివారులో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత మేకపై దాడి చేసి చంపేసింది.అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత పులిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అధికారులు కెమెరాలు ఏర్పాటు చేసిన పది నిమిషాల్లోని ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత మేకను లాక్కెళ్లినట్లు సీసీ టీవీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరోవైపు చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు