చంద్రబాబు మేనిఫెస్టో పట్టించుకోలేదు.. మాజీ మంత్రి పేర్నినాని

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు.

ఏ ఉద్యోగి రోడ్డు ఎక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని పేర్ని నాని తెలిపారు.చంద్రబాబు ఏ రోజూ మేనిఫెస్టోను పట్టించుకోలేదని పేర్కొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను టీడీపీ పట్టించుకోలేదని వెల్లడించారు.చంద్రబాబు కుమారుడికి భద్రత కరువైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్న ఆయన మాజీ సీఎం కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

Validation Check 2026
Advertisement