రైతుల గురించి చంద్రబాబుది మొసలి కన్నీరు..: మంత్రి కారుమూరి

ఏలూరు జిల్లాలో తుఫాను బాధిత రైతులను మంత్రి కారుమూరి నాగేశ్వర రావు పరామర్శించారు.ఈ క్రమంలో నాశనమైన పంట పొలాలను ఆయన పరిశీలించారు.

రైతులను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని మంత్రి కారుమూరి తెలిపారు.రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.

తేమ శాతం విషయంలో తేడాలు వస్తే సహించేది లేదన్నారు.ఇప్పటికే ఏడు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి కారుమూరి ధాన్యం డబ్బులను రైతులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అనంతరం చంద్రబాబుపై మండిపడిన ఆయన రైతుల గురించి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, రైతులు వాటిని నమ్మొద్దని సూచించారు.

Advertisement
నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు