ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సంసిద్ధం..: మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ప్రజలు మద్ధతు లేదన్నారు.

ప్రజలకు మళ్లీ మేలు చేయాలని తాము సిద్ధం అంటే ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సంసిద్ధం అంటున్నారని విమర్శించారు.సీఎం జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందన్న మంత్రి కాకాణి పోటీ చేయకుండా వదిలేసిందని విమర్శలు చేశారు.త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేస్తారని ఎద్దేవా చేశారు.

Validation Check 2026
Advertisement