బీజేపీపై బాబు కొత్త స్కెచ్‌.. ఇక ద‌బిడి దిబిడేనా...?

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయంగా కొత్త వ్యూహానికి తెర‌దీశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టిపెట్టిన బాబు.

ఇక‌పై.పార్టీని అన్ని విధాలా కాపాడుకోవ‌డంపైనా దృష్టి సారించారు.సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షాలు అంటే.

ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ప‌సిగ‌ట్టి.ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని కార్న‌ర్ చేస్తుంటాయి.

త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని అనుకుంటాయి.సాధార‌ణంగా ఏ పార్టీ అయినా అదే చేస్తుంది.

Advertisement

ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.కానీ, ఏపీలో చిత్రంగా బీజేపీ మాత్రం ప్ర‌భుత్వంలోని జ‌గ‌న్‌ను వ‌దిలేసి.

ప్ర‌తిప‌క్షంలోని చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లను టార్గెట్ చేస్తున్నారు.దీంతో చంద్ర‌బాబు త‌న బుర్ర‌కు ప‌దును పెంచారు.

ఏడాదిన్నర కాలంలో ఇటీవ‌ల బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టాక టీడీపీపై దాడులు పెరుగుతున్నాయి.ఎక్క‌డ మీడియా మీటింగ్ పెట్టినా.

ఎక్క‌డ మాట్లాడినా.సోము వీర్రాజు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.చంద్ర‌బాబుపై విరుచుకుప‌డుతున్నారు.

Advertisement

చంద్ర‌బాబు పాల‌నను ఎత్తిచూపుతున్నారు.

అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి కూడా ఇదే ప‌నిచేస్తున్నారు.మొత్తంగా వీరితో పాటు ఒక‌రిద్దరు కూడా ఇలేనే చేస్తున్నారు.దీంతో చంద్ర‌బాబు ఎవ‌రైతే.

టీడీపీని టార్గెట్ చేస్తున్నారో .జాబితాను సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.ఇక‌, నుంచి వారిని భారీ గా టార్గెట్ చేయాల‌ని పార్టీలో ని కీల‌క నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో బీజేపీ అద్య‌క్షుడుగా ఉన్న క‌న్నా లక్ష్మీనారాయ‌ణ కొన్ని విలువ‌లు పాటించారు.ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపించేవారు.క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌నలు చేసి.

ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుని వాటి ప్ర‌కారం విమ‌ర్శ‌లు చేసేవారు.ఏదో విమ‌ర్శించాలి కాబ‌ట్టి విమ‌ర్శ‌లు చేయ‌డం కాకుండా స‌బ్జెక్టు ప్రకారం ముందుకు వెళ్లేవారు.

కానీ, సోము మాత్రం త‌న వ్య‌వ‌హార శైలిని మొత్తంగా టీడీపీని టార్గెట్ చేయ‌డానికే వినియోగిస్తున్నార‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.దీంతో బీజేపీలో నేత‌లు కూడా ఇదేంటి ఈయ‌న ఇలా మాట్లాడుతున్నారు? అనే అనుకుంటున్నారు.ఇది రానురాను పెరుగుతుండ‌డంతో చంద్ర‌బాబు కొత్త‌గా విరుగుడు మంత్రం క‌నిపెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఇది ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియ‌క‌పోయినా.సోము కు మాత్రం సెగ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు