తాజాగా ఇన్‌స్టాలో ఒకరికి ఒకరు అన్‌ఫాలో చేసిన ఆ సెలబ్రిటీలు..

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కలిసి పనిచేసే వాళ్లు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేస్తుంటారు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు వంటి సినిమా ఫ్యామిలీలైతే తప్పకుండా ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవుతారు.

ఇక సెలబ్రిటీ కపుల్స్ కూడా మ్యూచువల్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తారు.సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు పొగుడుకుంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

ఒకవేళ విడిపోతే ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటారు.లేదంటే అన్ ఫాలో చేస్తారు.

ఇతరులతో పెద్ద గొడవ జరిగితే కూడా ఆ సెలబ్రిటీలను తమ ఫాలోవర్స్ లిస్ట్ నుంచి తొలగిస్తారు.సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా పెద్ద రీజన్ ఉంటేనే అన్‌ఫాలో చేయడం జరుగుతుంది.

Advertisement

కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం చిన్న కారణాలకే ఇతర సెలబ్రిటీలను అన్ ఫాలో చేసి షాక్ ఇచ్చారు.రీసెంట్‌గా ఇద్దరు సినిమా సెలబ్రిటీలు అలాంటి షాక్ లు ఇచ్చారు.

సాయిధరమ్ తేజ్

వారిలో మొదటి వారు సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ).మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్, అతడి సతీమణి స్నేహ రెడ్డిలను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాడు.దీనికి ప్రధాన కారణం బన్నీ పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం చేయకుండా ఎవరో వైసీపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారం చేయడమే! అంతేకాదు పవన్ కళ్యాణ్ పేరును తాను ఎప్పుడూ కూడా సినిమా ఈవెంట్స్ లో చెప్పడు.

ఏపీ ఎన్నికల సమయంలో మెగా హీరోలందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేపట్టారు కానీ అల్లు అర్జున్ ఒక ట్వీట్ తో సరిపెట్టాడు.వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు.

ఇది చాలామందికి కోపం తెప్పించింది.మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) కూడా కోప్పడ్డారు.

టాలీవుడ్ స్టార్ హీరో బన్నీతో నటించిన హీరోయిన్లు ఫేడ్ అవుట్.. ఈ విషయాలను గమనించారా?
పుష్ప 2 కు బోలెడు అవార్డులు.. అల్లు అర్జున్ కి రిప్లై ఇచ్చిన నాని!

బన్నీ మనవాడు కాదు అని ఒక ట్వీట్ కూడా చేశారు.సాయి ధరమ్‌ తేజ్‌కు కూడా బన్నీపై పీకలదాక కోపం పెరిగిపోయింది.

Advertisement

పవన్ అంటే సాయి ధరమ్‌ తేజ్‌కి చాలా ఇష్టం.అందుకే బన్నీ అన్‌ఫాలో చేసి తన కోపం చూపించాడు.

అయితే చాలా చిన్న కారణానికి సాయి ధరంతేజ్ ఇలా చేయడం బాగోలేదని చాలామంది అంటున్నారు.

ఛార్మి కౌర్

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత సినిమా ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ హరీ శంకర్, రవితేజ( Ravi Teja )లను ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసింది.దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె ప్రొడ్యూస్‌ చేసిన డబుల్ ఇస్మార్ట్ వచ్చే రోజే మిస్టర్ బచ్చన్ సినిమాని రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ రవితేజ నిర్ణయించుకున్నారు."మీ మూవీ రిలీజ్ డేట్ ని మార్చండి.

" అని హరిష్‌ శంకర్, రవితేజలను చార్మికౌర్ బతిలాడిందట.అయితే వాళ్లు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె బాగా డిసప్పాయింట్ అయింది.

అందుకే వారిద్దరినీ ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది.

తాజా వార్తలు