సౌండ్ చేశారని 60 మందిపై కేసులా..?: నారా లోకేశ్

విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసులా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

ఇందుకోసం టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తారా అని ప్రశ్నించారు.

వీళ్ల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు బట్టలు వేసుకున్న వారిపై కేసులు పెట్టేలా ఉన్నారని నారా లోకేశ్ విమర్శించారు.జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉందని తెలిపారు.

కేసులు పెట్టాలని ఆదేశాలు జగన్ ఇచ్చినా అమలు చేసినోడి బుర్రా, బుద్దీ ఏమైందని ప్రశ్నించారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు