నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!

ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కంటి సంబంధిత సమస్యలు ఉండేవి.కానీ ఇటీవల రోజుల్లో పదేళ్ల పిల్లలు సైతం కళ్ళ‌ద్దాలు పై ఆధారపడుతున్నారు.

గంటలు తరబడి ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ లను చూడటం, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి కంటి చూపు అనేది మందగిస్తోంది.ఫలితంగా కళ్ళ‌జోడుకు పరిమితం అవుతున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పొడి మీకు చాలా బాగా సహాయపడుతుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళజోడుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పు( Almond ) వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ ఒక కప్పు సోంపు గింజలు( Fennel Seeds ) వేసి వేయించుకోవాలి.

Advertisement

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లార‌బెట్టుకున్న బాదం పప్పు, సోంపు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తెల్ల మిరియాలు, ఐదు నుంచి ఆరు యాలకులు, పావు కప్పు పట్టిక బెల్లం( Jaggery ) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించడానికి అర గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి తీసుకోవాలి.

నిత్యం ఈ విధంగా చేశారంటే దృష్టి సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి.కంటి చూపు మెరుగుపడుతుంది.కళ్ళ‌ద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు.

కంటి చూపును షార్ప్ గా మార్చడానికి ఈ పొడి చాలా అద్భుతంగా సహాయం పడుతుంది.అలాగే రోజు నైట్ ఈ పొడిని పాల‌ల్లో కలిపి తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

నిద్ర నాణ్యత పెరుగుతుంది.అలాగే ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

Advertisement

ఎముకలు బలోపేతం అవుతాయి.మలబద్ధకం స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు