కృష్ణానదిలో కనకదుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్ల నదీ విహారానికి బ్రేక్ పడింది.

దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కృష్ణమ్మ ఒడిలో నదీ విహారం, తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు.

తాజాగా కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు.ఎగువను ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో నదీ విహారానికి సాధ్యపడదని జిల్లా కలెక్టర్ కు జల వనరుల శాఖ నివేదిక అందించింది.ఈ క్రమంలో నది ఒడ్డున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు