కోడెల మృతిపై సమగ్ర విచారణ జరగాలి

మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల మృతిపై వైకాపా నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కోడెల మృతి తర్వాత పరిణామాలు క్షణ క్షణంకు మారుతున్నాయి.పరిస్థితులను చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది.

అందుకే తెలంగాణ పోలీసులు కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణ కోరారు.అక్రమంగా తమ ప్రభుత్వం కోడెలపై కేసులు పెట్టిందంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అందులో ఎమాత్రం వాస్తవం లేదు.చట్టం ప్రకారం అంతా జరిగింది.

Advertisement

కక్ష సాధింపు అనేది లేనే లేదు అంటూ బొత్స పేర్కొన్నారు.తెలంగాణ పోలీసులు కోడెల మృతిని అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.

పలు విషయాలను సేకరిస్తున్నారు.ఏపీ మాజీ స్పీకర్‌ అయినా, ఏపీ నాయకుడు అయినా కూడా హైదరాబాద్‌లో మృతి చెందాడు కనుక తెలంగాణ పోలీసులు ఈ కేసును నమోదు చేయడం జరిగింది.

Advertisement