సౌత్‎పై బీజేపీ అగ్ర నాయకత్వం ఫోకస్

బీజేపీ అగ్రనాయకత్వం సౌత్ పై దృష్టి సారించింది.సౌత్ లోని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు కర్ణాటకపై బీజేపీ ఫోకస్ పెట్టింది.ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కానున్నారు.రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల పర్యటనలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement