కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శనాస్త్రాలు

సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సమైక్య నినాదంతో లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు.అవినీతి జరిగితే సీబీఐ ఎవరింటికైనా వస్తుందని తెలిపారు.

మునుగోడు ఎన్నిక తర్వాత కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని విమర్శించారు.కేసీఆర్ స్వార్థం కోసమే యాగం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని వెల్లడించారు.తెలంగాణలో ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారన్న ఆయన రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు