వెండి దీపాలు ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి

సాధారణంగా మనం ప్రతి రోజు దేవునికి దీపారాధన వెండి కుంది లేదా ఇత్తడి కుందిలో చేస్తూ ఉంటాం.

అయితే ప్రతి రోజు వెండి కుందిలో ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వెండి కుందిలో నెయ్యి వేసి వినాయకుని ముందు వెలిగిస్తే కోరుకున్న కోరికలు తీరతాయి.వెండి కుందిలో నెయ్యి వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే అజ్ఞానం పోయి జ్ఞానము వస్తుంది.

వెండి కుందిలో నెయ్యి వేసి లక్ష్మి దేవి ముందు వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి చంద్రుని ముందు వెలిగిస్తే చంచల స్వభావం పోయి స్థిరత్వం వస్తుంది.

వెండి కుందిలో నెయ్యి వేసి మంగళవారం కుజ గ్రహం ముందు వెలిగిస్తే బిపి కంట్రోల్ అవుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి బుధవారం బుధగ్రహం ముందు వెలిగిస్తే మంచి బుద్ది కలుగుతుంది.

Advertisement

వెండి కుందిలో నెయ్యి వేసి గురువారం గురు గ్రహం వద్ద వెలిగిస్తే ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి.వెండి కుందిలో నెయ్యి వేసి శుక్రవారం శుక్ర గ్రహం వద్ద వెలిగిస్తే సుగర్ వ్యాధి తగ్గుతుంది.

వెండి కుందిలో నెయ్యి వేసి శనివారం శనిగ్రహం వద్ద వెలిగిస్తే గుప్త రోగాలు నయం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు