కెసిఆర్ కు AP నిరుద్యోగ జేఏసీ పాలాభిషేకం

తెలంగాణాలో 91,142 ఉద్యోగాల భర్తీకి సిద్దం చేసిన కెసిఆర్, 80,039 ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్దం చేసి మరియు 11,103 కాంట్రాక్టు ఉద్యోగాలు ను రెగ్యులరైస్ కు సిద్దం చేసిన కెసిఆర్ ను విశాఖ పబ్లిక్ లైబ్రరీ వద్ద పాలాభిషేకం చేసి అభినందించిన AP నిరిద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్.

ఈ సందర్భముగా వీరు మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2,32,000 ఉద్యోగ ఖాళీలను, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచి ,తక్షణమే భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 60 సంవత్సరాలుకు తగ్గించాలని ,లేనిపక్షంలో నిరుద్యోగులు నష్టపోతారని ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో AP నిరిద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్, ఉపాధ్యక్షుడు విజయ రఘునాథ బట్ల, వాసుపల్లి రాంబాబు, అక్కబత్తుల గిరీష్, సనపల తిరుపతి రావు, రూపా,శిరీష తదితరులు పాల్గొన్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు