వివేకా హత్య కేసు హడావుడి... ఢిల్లీలో సీఎం జగన్ హడావుడి

ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసుకు సంబంధించిన హడావుడి నెలకొంది.

సీబీఐ ( CBI ) అధికారులు ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని( YS Bhaskar reddy ) అరెస్ట్‌ చేయడం జరిగింది.

ఆయన తనయుడు అయిన ఎంపీ అవినాష్‌ రెడ్డిని( MP Avinash Reddy ) అరెస్ట్‌ చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.అధికార పార్టీ ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు ఇప్పటికే పలు సార్లు విచారించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆయన్ను ఏ క్షణంలో అయినా అరెస్ట్‌ చేయవచ్చు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తల్లి అనారోగ్య పరిస్థితుల కారణంగా విచారణ కు హాజరు కాలేక పోతున్నాడు.

ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి( CM Jagan Mohan Reddy ) ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాచుర్యం సొంతం చేసుకుంది.వరుసగా కేంద్ర మంత్రులను మరియు బీజేపీ అధినాయకత్వం ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఏపీ యొక్క ప్రాజెక్ట్‌ లు మరియు నిధుల గురించి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్చించేందుకు వెళ్లడం జరిగింది అంటూ ఏపీ అధికారిక ప్రతినిధులు చెప్పడం జరిగింది.

Advertisement

కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు విపక్ష పార్టీ నాయకులు మాత్రం వేరుగా ప్రచారం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అనేది ఆ పై వాళ్లకే తెలియాలి.ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ హడావుడి చేస్తూ ఉండగా.ఏ క్షణంలో ఎవరు అరెస్ట్‌ అవుతారో అర్థం కాకుండా ఉంది.

ఇలాంటి సమయంలో సీఎం జగన్‌ ఢిల్లీలో ఉండటం ను కొందరు కొన్ని రకాలుగా అర్థం చేసుకుంటున్నారు.మరో వైపు సీబీఐ వారు తాజాగా కేసు లో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరును కూడా చేర్చడం జరిగింది.

దాంతో అధికార పార్టీ నాయకుల్లో ఆందోళన మరింతగా పెరిగింది అంటూ రాజకీయ వర్గాల టాక్‌.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
Advertisement

తాజా వార్తలు