ఈనెల 14న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీలో కేబినెట్ భేటీకి ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఈనెల 14న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది.

కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.కాగా ఈ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

అలాగే కేబినెట్ అజెండా అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.ఇందులో భాగంగానే ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుఫాను నష్టపరిహారంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement