ఆదిత్య -ఎల్1 మిషన్ పై ఇస్రో మరో ప్రకటన

ఆదిత్య -ఎల్1 మిషన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రకటన చేసింది.ఆదిత్య -ఎల్ 1 మిషన్ శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించిందని తెలిపింది.

స్టెప్స్ పరికరం సెన్సార్ లు భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా- థర్మల్, ఎలక్ట్రాన్లు, ఎనర్జిటిక్ అయాన్ లను కొలవడం ప్రారంభించాయని ప్రకటించింది.కాగా భూమి నుంచి 50 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేంత వరకు ఈ మిషన్ డేటాను సేకరిస్తుందని తెలిపింది.

అదేవిధంగా ఆదిత్య -ఎల్1 మిషన్ సేకరించిన డేటా భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడానికి సహాయపడుతుందని వెల్లడించింది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు