మహా నటికి నివాళులు అర్పించిన అనసూయ.. భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

అనసూయ భరద్వాజ్ ( Anasuya Bhardwaj ) ప్రస్తుతం బుల్లితెర పైన వెండితెర పైన పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉన్నారు.

ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై బిజీ అయ్యారు.

ఇక ప్రస్తుతం ఈమె తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు .ఈ క్రమంలోనే ఈమె భారీ స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తనపై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా అనసూయ గత నాలుగు సంవత్సరాల క్రితం జీ టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో భాగంగా మహానటి సావిత్రికి ( Savitri ) నివాళులు అర్పిస్తూ ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు అయితే ప్రస్తుతం ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ ట్రోల్స్ పై అనసూయ స్పందించారు.ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఈ వీడియో పై స్పందించాల్సి వచ్చిందని తెలిపారు.నాపై ఎన్ని విమర్శలు చేసిన నేను పట్టించుకోను కాకపోతే అక్కడ సావిత్రమ్మకు నివాళులర్పిస్తూ ఈ పర్ఫామెన్స్ చేశాను ఈ పర్ఫామెన్స్ పై ఇలాంటి విమర్శలు రావడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు.

Advertisement

మీరు నన్ను విమర్శిస్తే విమర్శించండి కానీ ఈ పర్ఫామెన్స్ ను మాత్రం విమర్శించోద్దని ఈ సందర్భంగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

గేమ్ ఛేంజర్, దేవర మధ్య ఇన్ని పోలికలా.. రెండు సినిమాల్లో కథ ఒకటే అంటూ?
Advertisement

తాజా వార్తలు