అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం..మళ్ళీ రిపీట్ అవుతుందా...?

భూమి వినాశనం ఇప్పటి వరకూ జరిగింది అందరూ భావిస్తున్నట్లుగా కేవలం ఐదు సార్లు మాత్రమే కాదని ఆరో సారి కూడా జరిగిందని శాస్త్రవేత్తలు గంటా పదంగా చెప్తున్నారు.

అంతేకాదు ఓ భయంకర వాస్తవాన్ని కూడా చెప్పారు.

ఇప్పటి వరకూ జరిగిన భూమి అంతం కేవలం పర్యావరణ ప్రభావం వలన జరిగిందట.భవిష్యత్తులో మానవాళి అంతరించిపోయే అవకాశాలు కూడా పర్యావరణ సమతుల్యం దెబ్బ తినడం వలెనే అంటున్నారు.

  భూమి ఆరోసారి అంతరించడం సుమారు 26 కోట్ల సంవత్సరాల క్రితమే జరిగిందని అంటున్నారు.ఈ ఆరు వినాశనాలు పర్యావరణ వినాశనం కారణంగానే జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ విధ్వంసాలు జరిగినప్పుడు అగ్ని పర్వతం పేలిపోవడం, లక్షల కిలోమీటర్ల మేరకు లావా విస్తరించి నగరాలకి నగరాలు, అడవులు తుడిచి పెట్టుకు పోవడం జరిగిందని తెలిపారు.

  మళ్ళీ ఇదే పరిస్థితి ఉద్భవించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైనా సరే మానవాళి పర్యావరణంపై దృష్టి పెట్టకపోతే భారీగా ప్రజలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తప్పులేదని కానీ పర్యావరణంపై చిన్న చూపు చూడటం తగదని వారిస్తున్నారు.వినాశనానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఇప్పుడు అదేరకమైన పరిస్థితులు కన్పిస్తున్నాయని అందోళన చెందుతున్నారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet