శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. లేజర్ కిరణాలతో పిడుగుల నుంచి రక్షణ

ఉరుములు, మెరుపుల వల్ల నిత్యం చాలా మంది చనిపోతున్నారు.వాటి నుంచి రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉండమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి మధ్య, మేఘం లోపల లేదా మేఘాల మధ్య విద్యుత్ విడుదల వల్ల మెరుపులు వస్తుంటాయి.వాటిని విద్యుత్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1752లో విద్యుత్ - మెరుపుల మధ్య సంబంధాన్ని నిరూపించాడు.అతని సిద్ధాంతం నేటికీ విద్యుత్‌తో వ్యవహరించడానికి మార్గదర్శకంగా ఉంది.

ఇక తాజాగా కొందరు శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీ కనుగొన్నారు.లేజర్ కిరణాలతో పిడుగుల నుంచి రక్షించుకునే సౌకర్యం కల్పించారు.

Advertisement

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ యొక్క లాబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్‌లోని పరిశోధకులు అద్భుతమైన టెక్నాలజీ కనుగొన్నరు.అధిక శక్తి గల లేజర్‌లను ఉపయోగించే వ్యవస్థను రూపొందించడం ద్వారా పిడుగుల నుంచి తప్పించుకునేలా వెసులుబాటు కల్పించారు.ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వతం పై నుండి ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుని లేజర్‌ను ఉపయోగించి మెరుపు దిశను మార్చడంలో పరిశోధకులు విజయం సాధించారు.

పరిశోధకుల సాధించిన ఈ పని వివరాలు నేచర్ ఫోటోనిక్స్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.ఇందులో తొలిసారిగా లేజర్‌తో ఎక్కువ దూరాలకు విద్యుత్ దిశను మార్చే ప్రయోగాలు జరిగాయి.లేజర్ పరికరం కారు పరిమాణంలో ఉంటుంది.

మూడు టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది.ఇది జర్మన్ పారిశ్రామిక యంత్రం నుండి లేజర్‌లను ఉపయోగిస్తుంది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఈ వ్యవస్థను 2,500 మీటర్ల ఎత్తైన పర్వతంపై ఉంచారు.

Advertisement

400 అడుగుల ఎత్తైన ట్రాన్స్‌మిషన్ టవర్ నుండి ఆకాశం వైపు లక్ష్యంగా పెట్టుకున్నారు.మెరుపు దిశను మార్చడానికి, శాస్త్రవేత్తలు సెకనుకు 1,000 లేజర్ కిరణాలను విడుదల చేశారు.మొదటి ప్రయోగంలో, మెరుపు మార్గం 50 మీటర్ల కంటే ఎక్కువ మారిందని పరిశోధకులు హై-స్పీడ్ కెమెరాతో రికార్డ్ చేశారు.

అధిక శక్తితో కూడిన లేజర్ పుంజం వాతావరణంలోకి విడుదలైనప్పుడు, పుంజం లోపల అత్యంత తీవ్రమైన కాంతి తంతువులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు వివరించారు.ఈ ఫైబర్స్ గాలిలోని నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులను అయనీకరణం చేస్తాయి.

స్వేచ్ఛగా కదలగల ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తాయి.ఈ అయనీకరణం చేయబడిన గాలిని ప్లాస్మా అని పిలుస్తారు మరియు ఇది విద్యుత్ వాహకం అవుతుంది.

ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల పవర్ స్టేషన్‌లు, విమానాశ్రయాలు, విండ్ ఫామ్‌లు మరియు లాంచ్ ప్యాడ్‌లు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను పిడుగుల నుండి రక్షించవచ్చు.

తాజా వార్తలు