ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే లిచి పండ్లు ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన ఎక్కువగా అమ్ముతున్నారు.అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు.
ఈ పండ్ల వాడకం ఈ మధ్యనే పెరిగింది.ఈ పండ్లు ఎక్కువగా చైనాలో పండుతాయి.
ఈ పండ్లను తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీరు కూడా ఆ పండ్లను కొని తినటం ప్రారంభిస్తారు.ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా రక్తంలో తెల్లరక్త కణాలు పెరగటానికి సహాయపడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పండును తింటే ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేసి మలబద్దకం సమస్యను తరిమికొడుతుంది.అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించేలా చేస్తుంది.అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పండు చాలా మంచిది.
ఈ పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన అధిక రక్తపోటును తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.లిచి పండ్లలో కాపర్, ఐరన్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచటంలో సహాయపడుతుంది.
రక్తహీనతతో బాధపడేవారికి ఈ పండు ఒక వరమని చెప్పాలి.లిచి పండ్లలో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది.
కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారికి బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy