హిందూ సనాతన ధర్మంలో అమర్నాథ్ యాత్రను చాలా పవిత్రంగా భావిస్తారు.ఈ యాత్ర చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు అమర్నాథ్ ధామ్ చేరుకుంటారు.
జమ్మూ అండ్ కాశ్మీర్( Jammu and Kashmir ) పరిపాలన యంత్రాంగం ఈ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌర్యవంతంగా చేయడానికి అనేక పనులను ఇప్పటికే మొదలుపెట్టింది.అమర్నాథ్ యాత్ర 2 నెలల పాటు కొనసాగుతుంది.
ఈ సమయంలో లక్షలాది మంది శివ భక్తులు దర్శనం, పూజల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు.
ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై 1వ తేదీ నుంచి మొదలై ఆగస్టు 31వ తేదీ వరకు జరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ ప్రాంతంలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహలో శివలింగాన్ని( Shivalingam ) చూడడానికి ప్రతి సంవత్సరం ఈ తీర్థయాత్ర నిర్వహిస్తూ ఉంటారు.ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 17వ తేదీ నుంచి మొదలవుతుంది.
రాజ్ భవన్ లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ( Governor Manoj Sinha )అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశంలో తీర్థయాత్ర షెడ్యూల్ను నిర్వహించారు.
ఇంకా చెప్పాలంటే తీర్థయాత్ర షెడ్యూల్ ను ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా పాదయాత్ర సజావుగా నిరంతరాయంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే అనంతరాలు లేని తీర్థయాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల ప్రథమ ప్రాధాన్యత అని లెఫ్టినెంట్ గవర్నర్ వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే అమర్ నాథ్ సందర్శించే భక్తులందరికీ సేవా ప్రదాతలకు పరిపాలన ఉత్తమ ఆరోగ్య సంరక్షణ ఇతర అవసరమైన సౌకర్యాలను అందిస్తుందని వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే భక్తులందరికీ ఎటువంటి అవాంతరాలు లేని తీర్థయాత్ర జరగాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy