టీడీపీని వీడుతున్న మరో ఎంపీ! జగన్ తో భేటీ!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు నేతల రాకపోకలు మొదలైపోయాయి.

ఇప్పటికే అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రహించిన నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటూ వైసీపీలో చేరుతున్నారు.

ఇప్పటికే చీరలు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసిపి పార్టీ కండువ కప్పుకున్నారు.ఇక వీళ్ళ దారిలోనే తాజా, మాజీ లందరూ వైసీపీలో లేదంటే జనసేన పార్టీలో చేరాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే మరోవైపు అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తాజాగా లోటస్ పాండ్ లో జగన్తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం వైసీపీలో చేరిక పై రవీంద్ర బాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.అది అమలాపురం ఎంపీ స్థానానికి జగన్ నుంచి హామీ లభిస్తే రవీంద్ర బాబు వైసిపి లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే ఓ వైపు టిడిపి నుంచి వైసీపీలోకి తాజా మాజీ లు అందరూ కూడా చేరి తమకు టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ కోసం ఇన్ని రోజులు పని చేసిన నేతలు అసంతృప్తి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

Advertisement

తాజా వార్తలు