సముద్ర తీరానికి కొట్టికొచ్చిన్న అరుదైన నీలి తిమింగళం( బ్లూ వేల్ )..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన చనిపోయిన నీలి తిమింగళం ( బ్లూ వేల్ ) కొట్టికొచ్చింది.

సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది.

అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటి.

అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.ఈ చేప ఒడ్డుకు చేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి తరలివచ్చారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు