ఎన్నికల హడావుడి లో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నా .
జనసేన మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంది అంటూ పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలను ఆ పార్టీ లైట్ తీసుకుంటోంది.
మిగతా పార్టీలు ఎంత హడావుడి చేసి ప్రజల్లో మద్దతు కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నా జనసేన పార్టీ మాత్రం సైలెంట్ గానే చాప కింద నీరులా తమ కార్యకలాపాలు చక్కబెడుతోంది.ఎవరికీ ఎటువంటి అనుమానం కలగకుండా అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించే పనిలో పడింది.
పార్టీలో చేరే యువత కోసం ఇంతకు ముందు ఏ పార్టీ చేయని విధంగా పరీక్షలు నిర్వహించి టాలెంట్ ఉన్న యువత రాజకీయాల్లోకి రప్పించాలని జనసేన అధ్యక్షుడు ఒక అవగాహనకు వచ్చాడు.ఇక ఇటీవల కొన్ని జిల్లాల్లో జరిపిన ప్రచారాల్లో అక్కడి స్థానిక జనసేన నాయకులతో చర్చలు జరిపారు.కాకపోతే ఇప్పటివరకు ఏపిలోని అన్ని నియోజక వర్గాలలో నాయకులను ఎంచుకోకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనెస్ గా మారింది.
జనసేన మీద విమర్శలు చేసే వారికి ఇది ప్రధాన అంశంగా కూడా మారింది.వచ్చే ఎలక్షన్స్ లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది.కాని అన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే నమ్మకం లేదు.
పవన్ కూడా ఎక్కువ నమ్మకం లేరని రాజకీయ నాయకుల విశ్లేషణ.కానీ ప్రతిపక్ష హోదా అందుకొని అసెంబ్లీలో ప్రశ్నించాలని పవన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
అందుకే జనాలు నమ్మగలిగే నాయకులను ఎంచుకోవడానికి సమయం ఎక్కువగా తీసుకుంటున్నారట.ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో టికెట్టు టికెట్లు ఖరారు చేసేశారని సమాచారం.
ఇప్పటికే పవన్ లిస్ట్ లో కొంత మంది నేతల పేర్లు ఉన్నాయని ఉన్నాయని సమాచారం.అయితే ఆ లిస్ట్ బయటపడకుండా చూసుకుని ఎన్నికల సమయానికి మార్పు చేర్పులతో ప్రకటించాలని చూస్తున్నాడు.
అయితే ఈ తతంగం అంతా బయటకు తెలియకుండా చాలా సీక్రెట్ గా జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy