తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

మరికొన్ని గంటల్లో సెప్టెంబర్ నెల రాబోతుంది.

సెప్టెంబర్ నెలలో దేవర సినిమా( Devara ) రిలీజ్ కానుండటంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులకు ఈ నెల ఒక విధంగా స్పెషల్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత తన ఫ్యామిలీ గురించి పోస్ట్ పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.తల్లి చిరకాల కోరికను నెరవేర్చి జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు షాలిని( Shalini ) కాగా ఆమె స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ అనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం పలు సందర్భాల్లో కుందాపూర్ గురించి ప్రస్తావించడం జరిగింది.కొడుకును తన సొంతూరుకు తీసుకెళ్లాలని షాలిని పలు సందర్భాల్లో భావించగా తాజాగా ఆమె కోరిక నెరవేరింది.

జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్ లో సొంతూరు కుందాపూర్ కు( Kundapur ) తీసుకొచ్చి ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠం దర్శనం చేయించాలనేది అమ్మ కోరిక అని తారక్ తెలిపారు.

Advertisement

అమ్మ కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని తారక్ పేర్కొన్నారు.అమ్మ కల నిజమైందని తారక్ అన్నారు.సెప్టెంబర్ నెల 2వ తేదీ అమ్మ పుట్టినరోజు అని అమ్మ కోరికను నిజం చేయడమే అమ్మకు ఇచ్చిన నిజమైన బహుమతి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

అమ్మ కోరికను సాధ్యమయ్యేలా చేసిన ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ కు కృతజ్ఞతలు అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.రిషబ్ శెట్టి( Rishab Shetty ) మాతో పాటు వచ్చి ఈ రోజును మరింత స్పెషల్ చేశాడని తారక్ పేర్కొన్నారు.

తల్లిపై తారక్ ప్రేమను చాటుకున్న తీరును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.రిషబ్ శెట్టి సొంతూరు కూడా కుందాపూర్ అనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ దేవర సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు