YCP Siddham : ‘సిద్ధం ‘ సభకు భారీగానే సిద్ధమవుతున్న వైసీపీ 

వరుసగా సిద్ధం( Siddham ) పేరుతో భారీ సభలను నిర్వహిస్తూ,  ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన అధికార పార్టీ వైసీపీ టిడిపి, జనసేన కూటమిని ఎదుర్కునేందుకు బలంగానే సిద్ధమవుతోంది.

బీజేపీ ఆ రెండు పార్టీలతో జత కలిసినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని , 2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) ప్రకటించిన మానిఫెస్టోను దాదాపు 99% పూర్తి చేసామని, ప్రజల్లో ప్రభుత్వ పాలనపై సంతృప్తి ఉందని , అదే తమను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందనే నమ్మకంతో వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) ఉన్నారు.

అందుకే నియోజకవర్గాల వారీగా భారీగా ఇన్చార్జిలను మార్చారు .తనను చూసే జనాలు ఓటు వేస్తారని , అభ్యర్థులు ఎవరనేది పట్టించుకోరనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఇప్పటికే విడతల వారీగా సిద్ధం పేరుతో సభలను నిర్వహించారు.

ప్రకాశం జిల్లా బాపట్లలోని అద్దంకిలో వైసిపి సిద్ధం నాలుగో సభను నిర్వహించబోతోంది.

Ycp Siddham Meeting In Addanki

ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని సభల కంటే భారీగా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.మూడు విడతలుగా నిర్వహించిన ఈ సభలకు భారీగా కార్యకర్తలు,  నాయకులు హాజరు కావడంతో,  అంతకుమించి జనాలు హాజరయ్యే విధంగా అద్దంకి( Addanki ) సభను నిర్వహించాలని వైసిపి ప్లాన్ చేస్తుంది .దాదాపు 15 లక్షల మంది వైసీపీ మద్దతు దారులతో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.బాపట్లలో సిద్ధం సభలో వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ వైసిపి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. 

Ycp Siddham Meeting In Addanki
Advertisement
Ycp Siddham Meeting In Addanki-YCP Siddham : సిద్ధం సభకు �

దీంతో ఈ సభను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .ఇప్పటికే టిడిపి సూపర్ సిక్స్( TDP Super 6 ) పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన నేపథ్యంలో,  దానికి మించి ఉండేలా మరిన్ని జనాకర్షణ పథకాలను మేనఫెస్టోలో చేర్చేందుకు వైసిపి ప్లాన్ చేసుకుంటుంది.ఈ సభకు హాజరయ్యే వైసిపి మద్దతు దారుల ద్వారా,  తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామనేది జనాలకు, ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా చేయడంతో పాటు,  ప్రతిపక్షాలకు వణుకు పుట్టించాలని వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు