వైరల్ వీడియో: ప్రాణాలకి తెగించి రైలు వద్ద సాహసాలు..

కొంతమంది సోషల్ మీడియా( Social media )లో ఫేమస్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు, సాహసంతో కూడిన ప్రమాదకరమైన అవిన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

వ్యూస్, లైక్స్ ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వింత వింత విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురి అవుతూ ఉంటారు.

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

అతివేగంగా వెళుతున్న గూడ్స్ రైల్లోకి ఇద్దరు వ్యక్తులు ఎక్కే విధానాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఇద్దరు వ్యక్తులు రైలు పట్టాల పక్కన నిలబడి ఉన్నారు.

మరో వైపు వారి స్నేహితులు ఫోన్లో వీడియో తీస్తున్న క్రమంలో ఒక గూడ్స్ రైలు( Goods train ) అటువైపుగా వచ్చింది.వేగంగా వెళుతున్న ఆ రైలును ఒక యువకులు ట్రైన్ కి సమీపంగా వెళ్లి.మరొక పక్కన పట్టాలపై పరిగెత్తుకుంటూ వెళ్లి రైళ్లు భోగిలను పట్టుకొని పైకి ఎక్కేసాడు.

Advertisement

అలాగే మరో యువకుడు కూడా అదే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గూడ్స్ రైలు ఎక్కేసాడు.ఇద్దరు చేసిన విన్యాసాలను వారి స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఈ వీడియో చూసిన కొంతమంది వివిధ రకాలుగా నెటిజన్స్ స్పందించారు.ఇలాంటి విచిత్ర విన్యాసాలు చేయడం చాలా ప్రమాదం అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు వ్యూస్ కోసం ఇలా చేయడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరేమో ఇలాంటి వారిని పోలీసులకు గుర్తించి ఖచ్చితంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలోచన ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి చూసి మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.

చనిపోయిన భార్యను బ్రతికించిన ఒడిశా వ్యక్తి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు