వేణుమాధవ్ కామెడీగా చెప్పిందే సినిమా తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?

దర్శకుడు ప్రశాంత్ నీల్( Directed Prashant Neel ) దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ( Star hero Yash )హీరోగా నటించిన సినిమా కేజిఎఫ్.

కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

కోటల్లో కలెక్షన్స్ను సాధించడంతో పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా సెన్సేషన్లో క్రియేట్ చేసింది.

ఈ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.కేజిఎఫ్ పార్ట్ వన్,పార్ట్ టు రెండు సినిమాలు కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే 2018లో విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పుడు తాజాగా మరోసారి చర్చ మొదలైంది.సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ సినిమా విషయమై ఒక కొత్త పాయింట్‌ ని తెరపైకి తెచ్చారు.దీంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Advertisement

రవితేజ, పూరి జగన్నాథ్‌ ( Ravi Teja, Puri Jagannath )కాంబినేషన్‌ లో వచ్చిన నేనింతే సినిమాలో డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే కుర్రాడిగా వేణుమాధవ్‌ కనిపిస్తాడు.ఫీల్డ్‌లో వున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లకు రకరకాల కథలు చెబుతాడు.

కానీ ఎవరూ అతన్ని ఎంకరేజ్‌ చెయ్యరు.తెలుగు వారికి తెలుగు వారి సపోర్ట్‌ ఉండదన్న ఉద్దేశంతో తన పేరును సెంథిల్‌గా మార్చుకొని తమిళ డైరెక్టర్‌గా అందర్నీ పరిచయం చేసుకుంటాడు.

ఆ సినిమాలో హీరో మల్లిక్‌గా నటించిన సుబ్బరాజుకు( Subbaraju ) కథ వినిపించడానికి రెడీ అవుతాడు.తమిళ్‌, తెలుగును మిక్స్‌ చేస్తూ ఒక కథ నేరేట్‌ చేస్తాడు.కన్నులెంది ఒరూ జూమ్‌ బ్యాక్‌ వంద ఫస్ట్‌ షాట్‌.

అంటూ ఆ కథలోని కొన్ని సీన్స్‌ని చెబుతాడు.ఆ సీన్‌లో కామెడీ అద్భుతంగా పండింది.

కాలినడకన తిరుమలకు వెళ్లిన నాని.. ఈ స్టార్ హీరో భక్తికి ఫిదా అవ్వాల్సిందే!
మేకిన్ ఇండియాకు సాయపడండి.. యూఎస్ డిఫెన్స్ కంపెనీలతో రాజ్‌నాథ్ సింగ్

అయితే అక్కడ ఆ సీన్ లో వేణుమాధవ్‌ కామెడీగా చెప్పిన ఆ కథే కెజిఎఫ్‌ స్టోరీ.ఆ కథలో చెప్పిన సీన్స్‌ అన్నీ కెజిఎఫ్‌లో ఉన్నాయి.

Advertisement

ఈ కామెడీ షాట్‌ను, కెజిఎఫ్‌ విజువల్స్‌ని మిక్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఒక నెటిజన్‌.అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వేణుమాధవ్‌ వాయిస్‌ లో కెజిఎఫ్‌ విజువల్స్‌ చూస్తుంటే అతను చెప్పిన స్టోరీ కరెక్ట్‌గా సరిపోయింది అనిపిస్తుంది.దీనిపై నేటిజన్స్ స్పందిస్తూ.

వేణుమాధవ్‌ కామెడీ కోసం చెప్పిన ఆ స్టోరీని ప్రశాంత్‌ నీల్‌ సీరియస్‌గా భారీగా తీసేశాడన్నమాట అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

తాజా వార్తలు