జక్కన్న కెరీర్‌లో మొదటి సారి ఇలా చేశాడు.. మెగా, నందమూరి ఫ్యాన్స్‌ ఆందోళన

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏ పని చేసినా కూడా పర్‌ఫెక్ట్‌గా చేస్తాడనే టాక్‌ ఉంది.

ఒక సినిమాను ప్రారంభించడానికి ముందు మొత్తం స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని, ఆ తర్వాత షూటింగ్‌కు సిద్దం అవుతాడు.

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌కు దాదాపు సంవత్సరం పాటు తీసుకునే రాజమౌళి తాజాగా ఆర్‌ఆర్‌ ఆర్‌ మూవీ విషయంలో మాత్రం కాస్త గతి తప్పినట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈసారి పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ రెడీ కాకుండానే చిత్రీకరణ మొదలు పెట్టాడట.

మొన్నటి వరకు మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరిపిన జక్కన్న రెండవ షెడ్యూల్‌ను సంక్రాంతి తర్వాత పెట్టుకున్నాడు.ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్‌లో ఇంకా మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.స్క్రిప్ట్‌ విషయంలో జక్కన్న మొదటి సారి పూర్తి సంతృప్తిగా లేకుండానే షూటింగ్‌ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరి పెద్ద హీరోల డేట్లు తీసుకోవడం, వారిద్దరి డేట్లు బాగా కాస్టీ అవ్వడంతో పాటు, వారి అభిమానులను ఇబ్బంది పెట్టకుండా మరీ ఎక్కువ కాలం పొడగించవద్దనేది రాజమౌళి అభిప్రాయమట.అందుకే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాకుండానే సినిమాను పట్టాలెక్కించాడు.

Advertisement

రాజమౌళి మొదటి సారి బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో కాకుండా అరకొర స్క్రిప్ట్‌తో సినిమాను పట్టాలెక్కించిన నేపథ్యంలో మెగా మరియు నందమూరి ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు.కాస్త సమయం ఎక్కువ అయినా పర్వాలేదు కాని ఎన్టీఆర్‌ చరణ్‌ల కెరీర్‌లో నిలిచి పోయే సినిమాలా ఈ చిత్రం ఉండాలని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.స్క్రిప్ట్‌ విషయంలో కాస్త అటు ఇటు తేడా జరిగితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

దాంతో జక్కన్న కాస్త సమయం తీసుకోవాలంటూ ఫ్యాన్స్‌ ఆందోళనగా సూచిస్తున్నారు.మరి కొందరు మాత్రం జక్కన్న స్క్రిప్ట్‌ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదనే ధీమాతో ఉన్నారు.2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా జక్కన్న ఈ మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు