Tollywood Heroes : సొంత తండ్రులకు స్టార్ హీరోలు చేస్తుంది వెన్ను పోటు లాంటిదే !

ఇక కృష్ణ చనిపోయాక ఇప్పుడిప్పుడే ఆ వార్తలకు జోరు తగ్గుతుంది.అంతలోనే కృష్ణ కు మెమోరియల్ కట్టబోతున్నట్టు మీడియాకు కాస్త ఉప్పందింది.

వాస్తవానికి కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానం లో చేయడం తో చాల గందర గోళం నెలకొంది.ఎన్నో ఎకరాల భూమి ఉన్న ఒక ఎకరం కూడా మహేష్ బాబు తన తండ్రి కోసం కేటాయించి అంత్యక్రియలు ఎందుకు చేయలేదు అని ఆందోళన చెందుతున్నారు.

అందుకు కాస్త డ్యామేజీ రిపేర్ అన్నట్టుగా ఇప్పుడు మెమోరియల్ కట్టి అభిమానులకు కాస్త ప్రశాంతతను ప్రసాదించారు.అయితే కృష్ణ కు మాత్రమే కాదు స్టార్ హీరోలు చాల మంది తమ తండ్రులకు అన్యాయం చేస్తున్నారనేది పచ్చి వాస్తవం.

అక్కినేని నాగేశ్వర రావు చనిపోయి ఇన్నేళ్లు గడుస్తుంది.అయన మెమోరియల్ గురించి నాటి నుంచి నేటి వరకు నాగార్జున ఆలోచించడం లేదు.

Advertisement

మరోవైపు అయన అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియో లో ఎక్కడ నిర్వహించారో కనీసం ఆ గుర్తులు కూడా లేవు.అంతెందుకు అన్నపూర్ణ స్టూడియో ఇంత బాగా వెలిగిపోతుండటం వెనక అయన ఎంతో కృషి చేసారు మరి అయన చనిపోయాక ఒక్క విగ్రహం కూడా కట్టకపోవడానికి గల కారణం ఏంటి ? అయన తన జీవితంలో సాధించిన అవార్డులు , అయన జ్ఞాపికలు, జ్ఞాపకాలు అన్ని ఒక గది లో భద్రపరిస్తే అందులో దొంగతనం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది.ఇదేమి ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.

ఇక కృష్ణ, అక్కినేని లకు మాత్రమే కాదు.సీనియర్ ఎన్టీఆర్ కి కూడా ఈ విషయంలో తీవరమైన అన్యాయం జరిగింది.

గోవెరమెంట్ కట్టించిన స్మారకం మినహా అయన ఆస్తులను అనుభవిస్తున్న ఎన్టీఆర్ కుటుంబం అయన కోసం ఏం చేసింది.ఆయనకు సంబదించిన అనేక అవార్డ్స్ మొదట్లో లక్ష్మి పార్వతి దగ్గర ఉండేవి.

ఆ తర్వాత బలవంతంగా హరికృష్ణ అన్ని తీసుకెళ్లిపోయారు.మరి అవి ఏం అయ్యాయో ఎవరికి తెలియదు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఇక మరి కృష్ణ కోసం అయినా మహేష్ బాబు నిజాయితీగా ఒక స్మారక మందిరం కట్టి జనాలకు అయన జ్ఞాపకాలను ఎప్పుడు అయినా చూసుకునే విధంగా మెమోరియల్ నిర్మిస్తారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Advertisement

తాజా వార్తలు