స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారం..: సీమన్స్ మాజీ ఎండీ సుమన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసు నిరాధారమైనదని సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు.2021 నాటికి 2.

32 లక్షల మంది శిక్షణ పొందారని తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ బాగా జరిగిందని 2021లో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేఖ రాసిందని సుమన్ బోస్ పేర్కొన్నారు.

ఒక్క సెంటర్ కూడా చూడకుండా ఈ ప్రాజెక్టు బోగస్ అంటున్నారన్నారు.విజయవంతమైన ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో ఎటువంటి అవినీతి లేదని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా అని ప్రశ్నించారు.సీమన్స్ తో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు ఒప్పందం ఉందన్న ఆయన మనీలాండరింగ్ జరగలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో కోర్టులకు అన్ని విషయాలు చెబుతామని, మార్కెటింగ్ లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని సుమన్ వెల్లడించారు.

Advertisement