తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన ప్రచారం

తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారాన్ని ముగించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.చెన్నూరు, సిర్పూర్, బెల్లంపల్లి, మంథని, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, మంచిర్యాల, పినపాకతో పాటు భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది.

కాగా మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పార్టీలు ప్రచారాలను ముగించనున్నాయి.ఈ క్రమంలోనే 5 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

అయితే ఎల్లుండి పోలింగ్ జరగనుండగా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
The Foods That Help To Kill Breast Cancer Details

తాజా వార్తలు